కాకుల్లా కావ్.. కావ్ అనడం తప్ప ఏం ప్రయోజనం లేదు – మోడీపై రసమయి ఫైర్

-

ప్రధాని నరేంద్ర మోడీపై టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కంచర్ల పాలెం సినిమా దాడి లాగా దేశంలోని నాయకులను తీసుకువచ్చి మాట్లాడించారని నిప్పులు చెరిగారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రంలో తెలంగాణ లో ఉన్న పథకాలు ఒక్కటైన ఉన్నాయా ? యాదాద్రి గురించి గొప్పగా చెప్పిన మీరు ఏమన్నా నిధులు ఇచ్చారా ? అని నిలదీశారు.

కేసీఆర్ ను అవమానం పరిచేలా మాట్లాడటం తప్ప ఒరిగిందేమి లేదు…మతం పేరిట శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకుల్లా కావ్ కావ్ అనడం తప్ప తెలంగాణ కు ఏమి చేసింది లేదన్నారు రసమయి బాలకిషన్.

బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైంది.. మేం నీళ్లు ఇవ్వకుండానే.. పంట పండకుండానే లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నారా? పంజాబ్ తర్వాత ఎక్కువ వరి పండిన రాష్ట్రం తెలంగాణనే అని నీతి ఆయోగ్ కూడా చెప్పిందని పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news