తెలంగాణ విద్యార్థులకు షాక్..ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు

-

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 28న ఎంసెట్ , పీజీ ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 3 నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగనుంది. ఏప్రిల్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తు కు అవకాశం ఉండనుంది. పీజీ ఈ సెట్ కి ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉన్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది.

అలాగే, మే 7,8,9 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు జరుగననున్నాయి. అలాగే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది. అయితే, ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యార్థులకు షాక్‌ తగిలింది. ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400 నుంచి రూ. 500కు పెంచగా.. ఇతర విద్యార్థులకు రూ. 800 నుంచి రూ.900కు పెంచింది విద్యాశాఖ.

Read more RELATED
Recommended to you

Latest news