మరో 23 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ

-

తెలంగాణలో మరో నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 23 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.

ఇటీవలే రాష్ట్రంలోని పలు విభాగాల్లో 1,540 సహాయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, అగ్రికల్చర్‌ విభాగాల్లో ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ప్రకటనలో అత్యధికంగా సివిల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ సూచించారు. పోస్టుల వారీగా పూర్తి వివరాలు, వాటికి సంబంధించిన విద్యార్హతలను ఈ నెల 15న కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news