మార్చి నుంచి అందుబాటులోకి TSRTC ఏసీ స్లీపర్‌ బస్సులు

-

తెలంగాణ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి దూరప్రాంతాలకు వెళ్లడానికి స్లీపర్ బస్సులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తమ ప్రయాణం హాయిగా సాగేలా ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఈడీ (ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు.

దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్‌ బస్సులను నడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ రోడ్డు ఎక్కించింది. నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల మాదిరే ఏసీ స్లీపర్‌ బస్సులకూ లహరి అని నామకరణం చేసింది. బస్సులను హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, హుబ్బళ్లి నగరాలకు నడిపించనున్నట్లు ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news