తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. రికార్డులు సృష్టించిన హుండీ

-

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. జూలై మాసంలో శ్రీవారి హుండి ఆదాయం అత్యధికంగా నమోదు అయింది. టిటిడి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వామివారికి 139.45 కోట్ల హుండి ఆదాయం లభ్యం అయింది.

ఇప్పటి వరకు గత మే మాసంలో లభించిన 130.5 కోట్ల హుండి ఆదాయమే అత్యధికం కావడం విశేషం. వరుసగా ఐదో నెల 100 కోట్లు దాటిన శ్రీవారి హుండి ఆదాయం నమోదు అయింది. జూలై మాసంలో ఐదు సార్లు 5 కోట్ల మార్క్ ని దాటిన శ్రీవారి హుండి ఆదాయం చేరుకుంది.

జూలై మాసంలోనే స్వామివారికి ఒక్కరోజు అత్యధిక హుండి ఆదాయం సమర్పించారు శ్రీ వారి భక్తులు. జూలై 4వ తేదిన స్వామివారికి 6.18 కోట్ల హుండి ఆదాయం వచ్చింది. ఒక్క రోజులో ఎక్కువ ఆదాయం నమోదైంది జూలై 4వ తేదీన కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news