తిరుమల భక్తులకు అలర్ట్..రేపు సెప్టెంబర్‌ కు చెందిన టికెట్లు విడుదల

-

తిరుమల భక్తులకు అలర్ట్. రేపు సెప్టెంబర్‌ కు చెందిన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కేట్లను రేపు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

రేపటి నుంచి 21వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన సేవా టికెట్లకు లక్కిడిఫ్ కోసం భక్తులు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించింది టీటీడీ పాలక మండలి. ఈ నెల 22 వ తేదీ ఉదయం 10 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. అలాగే, 22 వ తేదీన పవిత్రోత్సవాల సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం టికెట్ల కోటా విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news