షాకింగ్‌: టీవీ నటిని బలిగొన్న ఉగ్రవాదులు..

-

మరోసారి ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయారు. మంగళవారం చోటు చేసుకున్న ఉగ్రదాడి మరకవకముందే మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రాత్రి వరుస ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీవీ నటిని కాల్చి చంపడం కలకలం రేపింది. ఉగ్రదాడుల్లో ఆమె మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం.. బూద్గామ్‌ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్‌ చేసి కాల్పులకు తెగబడ్డారు. కాగా, బుధవారం రాత్రి.. ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్‌ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

TV actress killed by terrorist in Budgam of jammu and kashmir

తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్‌ జుబీర్‌కు కూడా బుల్లెట్‌ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్చలు చేపట్టినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news