పాదయాత్రలో నారా లోకేష్ కి ట్విస్ట్.. నోటీసులు జారీ

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కి ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. ఆయనకి నోటీసులు జారీ చేశారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని నోటీసులలో పేర్కొన్నారు. ఈ నోటీసులను నారా లోకేష్ కి అందజేసేందుకు వెళ్లారు తాడిపత్రి డీఎస్పీ చైతన్య. అయితే ఈ నోటీసులను తీసుకునేందుకు నారా లోకేష్ నిరాకరించారు.

నోటీసులు తీసుకునేందుకు లోకేష్ తిరస్కరించడంతో యాడికి టిడిపి మండల కన్వీనర్ రుద్రమ నాయుడుకి నోటీసులు అందజేశారు పోలీసులు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని పోలీసులు హితవు పలికారు. ఫ్యాక్షన్ ప్రాంతం తాడిపత్రి సునీతమైందని.. విధ్వంసానికి దారి తీసే ఏ పని, హింసను ప్రేరేపించేలా ఎలాంటి మెటీరియల్ పంపిణీ చేయవద్దన్నారు. ఒకవేళ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు నారా లోకేష్ పాదయాత్ర వద్ద పోలీసు భద్రత పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news