హత్రాస్ పూర్ ఘటన మరువక ముందే యూపీలో మరో రెండు రేప్ లు

-

ఉత్తర ప్రదేశ్‌ లో హత్రాస్ పూర్ ఘటన మరువక ముందే మరో రెండు దారుణ రేప్ ఘటనలు జరిగాయి. బలరాం పూర్ లో ఒక ఘటన కాగా అజంగర్ లో మరో ఘటన జరిగింది. బలరాం పూర్ లో యువతిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన సమయంలో 22 ఏళ్ళ యువతిని ఎత్తు కెళ్లి రేప్ చేశారు. ఆమెకు చిత్ర హింసలు పెట్టి నరకం చూపించారు. అపస్మారకస్థితిలో ఉన్న బాధితురాలిని… రిక్షాలో ఇంటికి పంపించారు నిందితులు.

ఆమెని లక్నోలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిందితుల్లో ఒకరు మైనర్‌. ఇక బులంద్‌ షహర్ లోని కాకోర్ ప్రాంతంలోని ఒక గ్రామంలో బుధవారం రాత్రి టీనేజ్ బాలికను ఇంటి పోరుగువారే రేప్ చేశారు. ఇక ఈ నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేశామని మరో వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news