చీమలపాడు పేలుడు ఘటనలో రెండుకు చేరిన మృతుల సంఖ్య

-

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో నేడు ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పేలుడు ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చడంతో పక్కనే ఉన్న గుడిసెకు నిప్పు అంటుకొని దగ్ధమైంది. మంటల వల్ల గుడిసెలోని సిలిండర్ పేలి అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండు కు చేరింది. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news