మరణించిన ఉగ్రవాదులకు కరోనా పాజిటివ్..!

-

శనివారం జమ్మూకశ్మీరులోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులకు కరోనా సోకినట్లు నిర్థరణ అయింది. నిబంధనల మేరకు మరణించిన ఉగ్రవాదులకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వీరి శాంపిల్స్ ని కరోనా పరీక్షలకు పంపగా.. వీరిద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్థరణ అయిందని అధికారులు తెలిపారు. జ‌మ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని అర్రా ప్రాంతంలో శనివారం కూంబింగ్ నిర్వహిస్తోన్న భ‌ద్రతా ద‌ళాల‌పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.

దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జ‌రిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన అలీ భాయ్ అలియాస్ హైదర్‌గా గుర్తించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news