నాకే పాపం తెలీదు: వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఆవేదన…!

-

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి… తన ఆడియో వైరల్ పై స్పందించారు. మీడియా లో ప్రసారం అవుతున్న ఆడియో నాది కాదు అని ఆమె క్లారిటీ ఇచ్చారు. నా ఆడియో లను మార్ఫింగ్ చేసి నా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. సందీప్ , సురేష్ లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని ఆమె విమర్శించారు. తనకు, పార్టీ కు చెడ్డ పేరు వస్తుందని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం అన్నారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేశాక నాపై సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆమె విమర్శించారు. నేను వెళ్లిన ప్రతి కార్యక్రమం లో నన్ను ఫాలో అవుతున్నారు అని ఆమె విమర్శించారు. నాకు వారి నుంచి ప్రాణహాని ఉంది అని అన్నారు. చేసిన తప్పు లకు కేసుల నమోదు కావడం తో నాపై తిరిగి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆమె విమర్శించారు. నా వాయిస్ మార్ఫింగ్ లు చేస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. నిజంగా నేను మాట్లాడినవే అయితే నేరుగా పోలీసులు కు ఇవ్వాలన్నారు. సామాన్య కార్యకర్తలు ఇంత సాహసం చేయలేరుని వీరి వెనుక ఓ నేత ఉన్నాడు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news