షాద్‌నగర్‌లో దారుణం.. యువతి సజీవ దహనం.. ఏం జ‌రిగిందంటే..?

-

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌,  ఫరూక్‌నగర్ మండలం చటాన్‌పల్లిలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి నిప్పంటించారు. మృతురాలు వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న మాదాపూర్‌లోని హాస్పిటల్‌కు ప్రియాంక స్కూటీపై వెళ్లింది. రాత్రి 9.30 ప్రాంతంలో శంషాబాద్‌కు తిరిగొచ్చింది. అప్పటి నుంచి ప్రియాంకరెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఉదయం 4.30 గంటల సమయంలో ప్రియాంకరెడ్డి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాగా, ప్రియాంక స్వస్థలం కొల్లాపూర్‌ మండలం నర్సాయిపల్లి. స్కూటి పాడైందని సోదరికి ఫోన్ చేసిన కాసేపటికే ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.

చెల్లెలికి ఫోన్ చేసిన సమయంలో… చుట్టూ లారీ డ్రైవర్లు ఉన్నారని భయంగా చెప్పిన ప్రియాంక రెడ్డి ఆ తర్వాత హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై స్పందించిన ప్రియాంక సోదరి, టైర్ పంక్చర్ అయిందని తనతో చెప్పిందని… అప్పుడు పక్కన ఉన్న లారీ డ్రైవర్లు తాము బాగు చేయిస్తామని చెప్పడంతో ఆమె మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి చేయలేదని ఆమె వివరించింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ప్రియాంకను కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఇక‌ ఉదయానికి శవమై ఆమె కనపడటంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news