ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే.. విభజన సమస్యలపై ముగిసిన కేంద్ర భేటీ

-

విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో భేటీ సాగింది. ఇందులో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలపైన ఈ సమావేశంలో చర్చ నడిచింది. అయితే విద్యుత్‌ బకాయిల అంశం చర్చకు రాలేదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. మరోసారి భేటీ కావాలా వద్దా అనే నిర్ణయం లేకుండానే భేటీ ముగియడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news