టీఆర్‌ఎస్‌ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి : అమిత్‌ షా

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు హజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టు‌కు చేరకున్న అమిత్ షాకు.. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అమిత్ షా ముందుగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సందర్శిచారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌ హోటల్ కు చేరుకున్న అమిత్‌ షా.. తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీ నేతలను సమావేశమయ్యారు.

HM Amit Shah sets 150-seat target for BJP in Karnataka assembly polls 2023

ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఇక్కడి పరిస్థితులను వివరించారు. దీనిపై స్పందించిన అమిత్‌ షా.. టీఆర్‌ఎస్‌ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలన్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని, అందుకు ప్రతి కార్యకర్త నుంచి జిల్లాస్థాయి నేతల వరకు కృషి చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news