కేసు వెనక్కి తీసుకోలేదని.. ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి ఇంటికి నిప్పు!

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి ఇంటికి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు నిప్పు పెట్టారు. ఉత్తర్ ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో బాధిత బాలిక కుమారుడు, చెల్లి తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిదంటే..?

పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవలే బెయిల్​పై విడుదలైన ఉన్నావ్​ అత్యాచార కేసు నిందితులు మరో ఐదుగురితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లారు. అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ నిరాకరణతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న నిందితులు బాధితురాలిపై దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టారు.

2022 ఫిబ్రవరి 13న అప్పటికి 11 ఏళ్ల వయసున్న బాలికపై అత్యాచారం జరగగా.. సెప్టెంబరు నెలలో ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. ఆ చిన్నారిని అంతమొందించడానికే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాలిక తల్లి ఆరోపించారు. బాధితురాలైన తమ కుమార్తెను అంతమొందించడానికే నిందితులు.. తమ ఇంటికి నిప్పు పెట్టారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news