మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఈ ముఖ్యమంత్రి దిగిపోవాలి – చంద్రబాబు

-

నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో బద్వేల్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడపలో ముఠాలు అణచివేసిన పార్టీ టిడిపి అని, కడపలో ముఠాలు, వర్గాలు లేని వ్యక్తి మాజీ మంత్రి వీరారెడ్డి అని తెలిపారు. వీరారెడ్డి ముఠా నాయకున్ని మట్టికరిపించిన నాయకుడని కొనియాడారు. బద్వేల్ వీరారెడ్డి స్ఫూర్తితో ఇక్కడ పార్టీ పనిచేస్తుందన్నారు చంద్రబాబు.

ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. ఒక నాయకుడు ఎలా ఉండాలో వీరారెడ్డి నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని సూచించారు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ ముఖ్యమంత్రి దిగిపోవాలి అన్నారు. తెలుగు జాతి చరిత్ర టీడీపీకి ముందు, తరువాత అని రాసుకునే పరిస్థితి రానందన్నారు. రెండు రూపాయల బియ్యంతో ఎన్టీఆర్ పేదల కడుపు నింపారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news