యూపీ ఎలెక్షన్స్: బీజేపీకి రెండో ఝలక్.. మరో మంత్రి రాజీనామా

-

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ మంత్రి ధారా సింగ్ చౌహన్ రాజీనామా చేశారు. మంగళవారం స్వామి ప్రసాద్ మౌర్యతో మొదలైన రాజీనామాల పర్వం రెండో రోజూ కొనసాగింది. వచ్చే నెలలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ నుంచి ఇద్దరు ఓబీసీ మంత్రులు వైదొలగడం గమనార్హం.

తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ధారా సింగ్ చౌహన్ 2015లో బహుజన్ సమాజ్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2017లో బీజేపీ అధికారంలోకి రావడంతో పర్యావరణ, అటవీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతకుముందు బీఎస్పీ తరఫున 1990ల్లో రాజ్యసభ సభ్యుడిగా, 2009-14 మధ్యకాలంలో లోక్‌సభ ఎంపీగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news