రేవంత్ రెడ్డిపై బాంబ్ పేల్చిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి !

-

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడే అతుకుల బొంతలాగా ఒకరికి మరొకరితో పడకుండా గందరగోళంగా ఉంది. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు గా ఉన్న రేవంత్ రెడ్డి అంటే ఎవరికీ పడడం లేదు. అందుకే ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఎవరో ఒకరు అడ్డు తగులుతున్నారు. తాజాగా శుక్రవారం రోజున మహాత్మగాంధీ యూనివర్సిటీ లో నిరుద్యోగుల నిరసన సభను ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కానీ మాజీ టీపీసీసీ చీఫ్ మరియు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాంబ్ పేల్చారు. రేవంత్ రెడ్డి ఈ నిరుద్యోగ నిరసన సభ గురించి నాతో చెప్పలేదు. కాబట్టి ఎల్లుండి జరగనున్న సభకు నేను హాజరు కావడం లేదు అంటూ చెప్పారు.

అయితే నిజంగానే రేవంత్ ఇతనికి ఈ సభ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదా ? లేదా మధ్యలో ఇంకేమైనా మతలబు జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఉత్తమ్ ప్రకతాం చూసిన రేవంత్ ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news