పద్ధతి మార్చుకో.. రేవంత్‌పై వీహెచ్ ఆగ్రహం..!

-

తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాట రోజురోజుకి పెరిగిపోతుంది. సొంత నేతలే ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును రోడ్డున పడేస్తున్నారు. తాజాగా.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు విరుచుకుపడ్డారు. రేవంత్ వ్యవహారం కొత్త భిక్షగాడిలా ఉందని, తన పద్ధతి మార్చుకోవాలని మండిపడ్డారు. నేనే సీఎం అని గతంలో ఎవరూ చెప్పుకోలేదని, తమలాంటి సీనియర్లపై అడ్డగోలు పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

తమని కించ పరిచే విధంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బీసీలు ఓట్లు వేసే మిషన్లు కాదని, మా ఓపికను పరీక్షించొద్దని వ్యాఖ్యానించారు. కాగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చిరిన నాటి నుండి చాలామంది సీనియర్లు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు రేవంత్ రెడ్డి మీద పార్టీ సీనియర్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా మొదటి నుండి రేవంత్ ను వ్యతిరేకించిన వారిలో వీహెచ్ ఒకరు.

Read more RELATED
Recommended to you

Latest news