నవల నుండి వెండితెర మీదకు.. పంజా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా “కొండపొలం” 

-

మెగా కుటుంబం నుండి ఉప్పెనలా దూసుకువచ్చి ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్, తన రెండవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టైటిల్ ని చిత్రబృందం ఈరోజే ప్రకటించింది.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి “కొండపొలం” అనే టైటిల్ ని పెట్టారు. ఆసిగా ఉప్పెన సినిమాతో చెరగని ముద్ర వేసిన వైష్ణవ్, కొండపొలం సినిమాలో కటారు రవీంద్ర యాదవ్ గా కనిపించనున్నాడు. టైటిల్ పోస్టర్ చూస్తుంటే ఆద్యంతం అడవుల్లో సాగే సినిమాగా కనిపిస్తుంది. పచ్చని కొండలు, వాటి మీద ఉన్న గొర్రెలు చూస్తుంటే సినిమా మొత్తం అడవుల్లోనే ఉండేలా కనిపిస్తుంది.

ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి నవల కొండపొలం ఆధారంగా తెరకెక్కించారు. తానా నవలల పోటీలో ఉత్తమ రచనగా ఆ నవలకి అవార్డు వచ్చింది. మరి కొండపొలం సినిమాతో మరో మారు వైష్ణవ్ తేజ్ హిట్ కొడతాడేమో చూడాలి. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news