ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన వంశీ, రాధా భేటీ..

-

ఏపీలో రాజకీయాల్లో రోజుకో ములుపు తిరుగుతున్నాయి. అయితే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ మాజీ ఎమ్మెల్యే  వంగవీటి రాధా నిన్న భేటీ కావడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఉంగుటూరు మండలంలోని ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు.

రాధాతో వంశీ ఏకాంత చర్చలు: దుట్టా, యర్లగడ్డతో డైలాగ్ వార్.. ప్రాధాన్యం.. | vangaveeti  radha meets vallabhaneni vamsi at function - Telugu Oneindia

ఇద్దరూ పరస్పరం కరచాలనంతో పలకరించుకున్న అనంతరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ఏకంతంగా కాసేపు మాట్లాడుకున్నారు. రాధాను దగ్గరుండి కారులో ఎక్కించిన వంశీ అనంతరం మాట్లాడుతూ.. రాధా తనకు మంచి మిత్రుడని, చాలా రోజుల తర్వాత కలవడంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నామని అన్నారు. కాగా, గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావు-వంశీ మధ్య వివాదం నెలకొన్ని పరస్పర నిందారోపణలు చేసుకుంటున్న క్రమంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news