వైసీపీ ప్రభుత్వం ఆడదానికి భయపడుతోంది: వంగలపూడి అనిత

-

వైసీపీ ప్రభుత్వం పై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. వైసిపి ప్రభుత్వం ఆడదానికి భయపడుతోందని విమర్శించారు. కాబట్టే ఆడవాళ్లపై పోలీసులతో దాడి చేస్తుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మహిళ పోస్టు పెడితే దానికి పోలీసులు రంగంలోకి దిగి స్టేషన్ కు పిలిపించి కొట్టిస్తారా..?ఆమె పెట్టిన పోస్ట్ ను డిలీట్ చెయ్ ఇస్తారా?వైసీపీ ప్రభుత్వం భయంతో వణుకుతుంది కాబట్టే ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని అన్నారు అనిత. మీరు చేసే ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు తెలుగు మహిళలు భయపడరని గుర్తుంచుకోండని హెచ్చరించారు.

ఆడవాళ్ళ తాళిబొట్లను తెంచేసే కార్యక్రమానికి జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని విమర్శించారు. గతంలో రౌడీషీటర్ గా ఉన్న వ్యక్తిని జగన్ రెడ్డి ఎమ్మెల్సీ ని చేస్తే అతనేమో సొంత డ్రైవర్ ని చంపేసి దర్జాగా తిరుగుతున్నాడు అని విమర్శించారు. జగన్ రెడ్డి ఎవరికైనా పదవులు ఇచ్చే ముందు వాడి పై ఎన్ని కేసులు ఉన్నాయో, ఎంత అక్రమార్జన చేశాడు, ఎన్ని హత్యలు, అత్యాచారాలు చేశాడు వాడికి పదవి ఇస్తే మనకు ఎంత ఇస్తాడు.. ఇలాంటివి లెక్కల్లో వేసుకుంటాడు అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news