ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

-

దిగ్గజ నేపథ్య గాయనీ వాణీ జయరాం అంత్యక్రియలు తమిళనాడు రాష్ట్ర అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. అయితే ఆమె ఎలా చనిపోయిందనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. వాణీ జయరాం మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరాం అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె భౌతికకాయానికి వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు కడసారి నివాళులు అర్పించారు. వాణీ జయరాం 78 సంవత్సరాలు. 2018లో ఆమె భర్త జయరాం మృతి చెందారు.

అప్పటినుంచి చెన్నైలోని హడోవ్స్ రోడ్ లోని తమ నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. నిన్న పనిమనిషి ఆమె ఇంటికి రాగా, ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో, వాణీ జయరాం సోదరికి సమాచారం అందించారు. వారు ఇంట్లోకి ప్రవేశించి చూడగా, వాణీ జయరాం బెడ్ రూంలో విగతజీవురాలిగా పడి ఉన్నారు. ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news