ఈ కుట్ర బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు చేయాలి : వర్ల రామయ్య

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసు ఇంకా పూర్తవలేదు – ఇంకా ఉందని, విశాఖపట్నం ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఈ కుట్ర బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 13వ తారీఖున కిడ్నాప్ అయితే, 15వ తారీఖు వరకు పోలీసులకు తెలియలేదంటే, ఎంపీ ఈ కిడ్నాప్ విషయం పోలీసులకు చెప్పలేదంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లే అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగితే, ఇంత వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎందుకు స్పందించ లేదు?

varla ramaiah, బాబూ నీ కులమేంటి.. వివాదంలో వర్ల రామయ్య! - ap rtc chairman varla  ramaiah controversial comments on passenger - Samayam Telugu

సిట్టింగ్ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగితే లోక్‌సభ సెక్రటేరియట్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదు? పట్టపగలు ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తే, రాష్ట్ర గవర్నర్‌ స్పందన రాష్ట్ర ప్రజలకు తెలియకపోవడంలో అర్థం ఏమిటీ..? రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయితే ఎందుకు స్పందించలేదు? ఎందుకు పరామర్శించలేదు ? కిడ్నాప్ అయిన వారిలో ఒకరైన ఆడిటర్ జీవీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడన్నతి నిజమేనా? కిడ్నాప్ అయిన తర్వాత ఎంపీ సత్యనారాయణ నేను ఈ రాష్ట్రంలో ఉండను నా వ్యాపారమంతా తెలంగాణా రాష్ట్రానికి మార్చుకుంటానని చెప్పడం రాష్ట్రంలో శాంతి భ్రదతలు పూర్తిగా క్షీణించినవని ప్రభుత్వ ముఖాన చెప్పినట్లు కాదా? తర్వాత ఎంపీని సిఎంఒ అధికారులు బెదిరించి నేను రాష్ట్రంలోనే ఉంటాను తెలంగాణ వెళ్లనని అతని అభీష్టానికి వ్యతిరేకంగా చెప్పించినది నిజం కాదా..?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news