అలా అయితే డీజీపీని ఉద్దేశించి ఇకపై మాట్లాడను…వర్ల ఆసక్తికర కామెంట్స్

-

దేవాలయాల దాడులకు సంబంధించిన ప్రస్తావనలో దోషులను అరెస్ట్ చేసినట్లు చెప్పిన డీజీపీ, పార్టీల ప్రమేయం ఉందని చెప్పడం రాష్ట్రప్రజానీకాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. డీజీపీ ఏ సమాచారంతో మీడియాతో మాట్లాడారు?  సీఐడీ, సిట్ సంస్థలు ఇచ్చిన సమాచారంతోనా లేక సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారంతో మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు.

13వ తేదీన మాట్లాడిన డీజీపీ ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి, 15వ తేదీన మాట్లాడుతూ, రాజకీయపార్టీలకు సంబంధించిన వారి ప్రమేయం ఉందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఏ డీజీపీకూడా మాట్లాడని విధంగా ఆయన అధికారపార్టికి వత్తాసుపలుకుతూ దిగజారి మాట్లాడారని ఆయన అన్నారు. డీజీపీ వ్యాఖ్యలను, ఆయన విధినిర్వహణ తీరుని ఐపీఎస్ అధికారుల సంఘం కూడా సమర్థించదని ఒకవేళ అలా సమర్థించినట్టయితే, డీజీపీని ఉద్దేశించి ఇకపై తాను మాట్లాడనని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news