నీటి వివాదంపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ నోట్.

-

తెలంగాణ ప్రభుత్వ రోడ్డు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆంధ్ర నాయకులను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దివంగత నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పాలిట రాక్షసుడని, జగన్ అంతకంటే ఎక్కువ అన్న మాటలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయమై ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి, తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని, ఆ మాటలు ఆంధ్రప్రజలను ఉద్దేశించినవి కాదని, పాలకులను ఉద్దేశించే అలా మాట్లాడానని అన్నారు.

ఇంకా, ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమ ప్రాజెక్టులే అని, తెలంగాణ రైతుల పొట్ట కొట్టేందుకే ఇలా చేస్తున్నారని, నీటి వివాదం విషయంలో కేంద్రంపై ఉద్యమిస్తాం అని తెలిపారు. ఆందోళనలు చేపట్టి తెలంగాణకి రావాల్సిన వాటాను తీసుకుంటామని అన్నారు. క్రిష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు నష్టపోతున్నాయని వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version