నేడు ముచ్చింతల్ కు ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు

-

రంగ‌రెడ్డిలోని ముచ్చింతల్ లో గ‌ల రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ధి ఉత్స‌వాలు నేటితో 11 వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్స‌వాల‌కు ప్ర‌తి రోజు చాలా మంది ప్ర‌ముఖులు వ‌స్తున్నారు. ఢిల్లీ నుంచి ఇప్ప‌టికే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర హొం మంత్రి అమిత్ షా, కేంద్ర ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో ప‌టు చాలా మంది ప్ర‌ముఖులు వ‌చ్చారు. కాగ ఈ రోజు భార‌త ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు రామానుజా చార్య‌లు విగ్ర‌హాన్ని ద‌ర్శించుకోనున్నారు.

ఈ రోజు సాయంత్రం 6 :30 గంట‌ల‌కు ముచ్చింతల్ కు చేరుకుంటారు. చిన్న జీయ‌ర్ స్వామితో ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు స‌మ‌తా మూర్తి కేంద్రాన్ని సంద‌ర్శిస్తారు. అనంత‌రం రామానుజా చార్యుల 3డీ మ్యాపింగ్ ను చూస్తారు. అలాగే స‌మ‌తా మూర్తి కేంద్రం లో ఉన్న 108 దేవాల‌యాల న‌మూనాను ద‌ర్శించుకుంటారు. కాగ శుక్ర‌వారం స‌మ‌తా మూర్తి కేంద్రంలో యోగా గురు రాందేవ్ బాబాతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సంద‌డి చేశారు. రామానుజాచార్యుల విగ్ర‌హంతో అల్లు అర్జున్ సెల్ఫీ తీసుకున్నారు. కొంత స‌మ‌యం అక్క‌డే గ‌డిపారు.

Read more RELATED
Recommended to you

Latest news