త్వరలో బుల్లితెరపైకి కత్రినా-విక్కీ.. ఫొటోలు వైరల్!

-

వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్​ జంట. ఇన్ని రోజులు ఆఫ్​ స్క్రీన్​కే పరిమితమైన ఈ జంట త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు. తాజాగా వెకేషన్​ డ్రెస్​లో ఉన్న వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

బాలీవుడ్​ కపుల్​ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో బుల్లి తెరపై సందడి చేయనున్నారు. ఇన్ని రోజులు ఆఫ్​ స్కీన్​లో ఈ జంట.. ఇప్పుడు ఆన్​ స్క్రీన్​పై మెరవనున్నారు. అయితే తాజాగా దానికి సంబంధించిన ఫొటోలు వైరల్​గా మారాయి. అందులో వారిద్దరూ మంచి హాలీడే బట్టల్లో మెరుస్తున్నారు. దీన్ని చూసిన విక్కీ-కత్రినా జంట అభిమానులు ఆనందపడిపోతున్నారు.

గత సంవత్సరం పెళ్లి చేసుకున్న ఈ జంట.. సోషల్​ మీడియాలో చురుకుగా ఉంటారు. అప్పుడప్పుడు తమ ఫొటోలు షేర్​ చేస్తుంటారు. వీరి వివాహం గత సంవత్సరం డిసెంబర్​లో రాజస్థాన్​లో జరిగింది. విక్కీ కౌశల్​ను పెళ్లి చేసుకున్నాక.. తన ఆనందాన్ని ఫొటోల రూపంలో సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తోంది కత్రినా. రెండేళ్లు డేటింగ్​లో ఉన్నా.. పబ్లిక్​లో ఆ విషయం గురించి ఒప్పుకోలేదు.

అయితే కాఫీ విత్ కరన్ షోలో కత్రినా.. తాను విక్కీని జోయా అక్తర్​ పార్టీలో కలిశానని.. అప్పటి నుంచి తమ ప్రేమ కథ మొదలైందని చెప్పింది. అయితే అంతకముందు విక్కీ అంటే ఎవరో తనకు తెలియదని చెప్పింది. మొదట్లో విక్కీ అనే పేరు మాత్రమే తెలసునని.. కానీ అతడిని ఎప్పుడూ కలవలేదని తన ప్రియుడి గురించి ఓ సందర్భంలో తెలిపింది. తమ ఇద్దరి కలయిక ఊహించని పరిణామం అని పేర్కొంది. విధి తమ ఇద్దరిని కలిపిందని చెప్పింది. విక్కీ తనను కలిసిన నుంచి ఎన్నో యాదృచ్చిక సంఘటనలు జరిగాయని చెప్పింది. ఒక్కోసారి అవన్నీ తనకు కలలుగా అనిపిస్తాయంది.

అటు సినిమా జీవితంలో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. కత్రినా తాజాగా నటించిన చిత్రం ‘ఫోన్​ భూత్’​. ఇందులో సిద్ధాంత్​ చతుర్వేది ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్​ 24న విడుదల కానుంది. దీంతో పాటు కత్రినా, విజయ్​ సేతుపతి, ‘టైగర్ 3’, సల్మాన్​ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మరో చిత్రం ‘మెర్రీ క్రిస్ట్​మాస్​’. ఈ చిత్రం ఏప్రిల్ 23, 2023లో విడుదల కానుంది. మరో పక్క విక్కీ కౌశల్ కూడా సినిమాల్లో బిజీ బిజీగా గుడుపుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news