100 మంది ఫ్యాన్స్​ను మనాలీ ట్రిప్​కు పంపిన విజయ్ దేవరకొండ

-

ఫ్యాన్స్​ను ట్రీట్ చేయడంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టైలే వేరు. సాధారణ వ్యక్తిలా తను తన అభిమానులతో వ్యవహరిస్తూ ఉంటాడు. వాళ్లు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే వెళ్లి సాయం చేస్తాడు. అంతేకాదు వాళ్ల కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు ఈ హీరో. అలా ఐదేళ్ల క్రితం ఓ వినూత్న కార్యక్రమం మొదలుపెట్టాడు విజయ్.

ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగ, కొత్త సంవత్సరం సంద‌ర్భంగా.. దేవ‌ర‌సంతా అనే క్యాంపెయిన్ పేరుతో వంద మంది అభిమానుల‌ను ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఈ ప్లాన్​ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్​గా మార్చాడు రౌడీ హీరో. ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగంగా 100 మంది అభిమానులను హాలిడే ట్రిప్​కు పంపిస్తున్న‌ట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

ప్రకటించడమే కాదు 100 మందిని ఎంపిక చేసి మనాలీ ట్రిప్​కు పంపించాడు. ఈ ట్రిప్ ఫిబ్ర‌వ‌రి 17 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఉండ‌గా.. వారం రోజుల కింద‌టే వారి పేర్ల‌ను అనౌన్స్ చేశాడు. టూర్​కు వెళ్తూ ఫ్యాన్స్ పంపిన వీడియోను తాజాగా విజ‌య్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు.

”100 మంది లక్కీ ఫ్యాన్స్ విమానంలో ఉన్న వీడియో ఇది. వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. ఈరోజు ఉదయం వాళ్లు ఫ్లైట్ లో ఉన్న వీడియోను నాకు పంపించారు. హాలీడే ఎంజాయ్ చేయడానికి పర్వతాల్లోకి వెళ్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచీ 100 మంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది” అని విజయ్ ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news