విజయశాంతి షాకింగ్ రెమ్యునరేషన్… మరీ అంత తీసుకుంటుందా…?

-

మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. రష్మిక మంధన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఈ సినిమా పూర్తి చేసుకుంది. మహర్షి సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో,

అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా అలనాటి అగ్ర హీరోయిన్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచార౦. కథలో ఆమె కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను డిజైన్ చేసారట. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో ఆమె కూడా ఈ సినిమా చేసారట.

అది పక్కన పెడితే ఈ సినిమా కోసం ఆమె భారీగా పారితోషకం తీసుకుంటున్నారట. దాదాపు రెండు కోట్ల వరకు ఆమెకు ముడుతున్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ రష్మిక మందన్నా కంటే ఆమె పారితోషకం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. లేడీ సూప‌ర్ స్టార్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఆమె పాత్ర‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అప్పటి ఆమె అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news