సీఎం జగన్‌ ఎన్నో కష్టాలు పడ్డాడు – విజయమ్మ

-

తన జీవితంలో సీఎం జగన్‌ ఎన్నో కష్టాలు పడ్డాడని వైఎస్‌ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపటి క్రితమే.. ఇడుపులపాయ నుంచి.. వైసీపీ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.ఈ నేపథ్యంలోనే… సీఎం జగన్‌, విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ… మీ అందరి హృదయాల్లో రాజశేఖర్ రెడ్డి సజీవంగా ఉన్నారన్నారు.

ప్రజల అభిమానం నుంచి వైసీపీ పార్టీ పుట్టిందని చెప్పారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని… పార్టీ అంటేనే ప్రజల అభిమానం అని వివరించారు. జగన్ అనేక కష్టాలు ఎదుర్కొన్నారని… మా కుటుంబం అనేక నిందలు భరించిందని ఆవేదన వ్యక్తం చేశారు విజయమ్మ. అధికారం కోసం అనేక పార్టీలు పుడతాయి… కానీ వైసీపీ మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసం పుట్టిందని స్పష్టం చేశారు.

అన్యాయంగా కేసులు పెట్టి వేధించాలని… ఇలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ యువతకు రోల్ మోడల్ అని విజయమ్మ చెప్పారు. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా… వైయస్ రాజశేఖర్ రెడ్డి అందరివాడు అని తెలిపారు. నా బిడ్డ నడిపించిన మీ అందరి పైన నా అనువణువునా కృతజ్ఞత ఉందన్నారు విజయమ్మ. ఈరోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నామని.. ఆనాడు అధికార శక్తులని జగన్ పై విరుచుకుపడ్డ బెదరలేదని గుర్తు చేశారు విజయమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news