తండ్రీకొడుకులపై విజయసాయి ఘాటు ట్వీట్..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రగడ మొదలైంది. ప్రతిపక్ష నేతలను ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తున్నారు. నిరసనలతో, విమర్శలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతుంది. అరెస్టు కాబడ్డ నేతలు ఎవరి పేరు చెప్తారోనన్న భయం నేతల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఉండేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ప్రయత్నాలు జరుపుతున్నారంటూ వారి పేర్లను ప్రస్తావించకుండా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘లాక్‌డౌన్‌లో ఈ తండ్రీకొడుకులు హైదరాబాదే సురక్షితమైన ప్రాంతమని భావించారు. ఇప్పుడు దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఉండేందుకు దాక్కోవడానికి వారిద్దరు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుంటున్నారు’  అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news