ఉమామహేశ్వరిని మా చంద్రన్న వేధించాడా? ఇంకెవరైనా చంపి ఉరివేశారా ? : విజయసాయి

-

ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయని.. మా చంద్రన్న వేధించాడా ? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా ? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. CBI దర్యాప్తు కోరి నిజం నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా అంటూ చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అప్పట్లో కోడెలది గుండెపోటు అన్నారు. తర్వాత ఉరి వేసుకున్నారని చెప్పారు. ఆయన మొబైల్ మాయం చేశారు. ఉమామహేశ్వరి గారిదీ సహజ మరణమని నమ్మించాలని చూశారు. చంద్రబాబుకు దగ్గరివాళ్లే ఎందుకిలా అర్ధాంతరంగా చనిపోతున్నారు? అని ప్రశ్నించారు సాయి రెడ్డి. వైఎస్ గారి మరణంపై అవమానకరంగా మాట్లాడారు. జగన్ గారిపై హత్యాయత్నం చేయించి కోడి కత్తి అంటూ హేళన చేశారు. బరితెగించినోళ్లకి చంపడం, సుపారీ హత్యలు చేయించడం ఒక లెక్కా ? అని చురకలు అంటించారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news