మరోసారి చంద్రబాబుపై విజయసాయి విమర్శలు.. వీడియోలో రిమిక్స్‌

-

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన దైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని బాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడా ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని వెల్లడించారు.

ఇక సీఎం కాలేనని చంద్రబాబుకు స్పష్టత వచ్చిందని, కానీ పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోందని విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబు ఓటు వేసిన వీడియోను, గతంలో చంద్రబాబు ప్రెస్ మీట్ లో విలపించిన దృశ్యాలను కలిపి ట్విట్టర్ లో పంచుకున్నారు. అయితే.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాలు బరిలో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version