చంద్రబాబు, లోకేష్ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వ్యవహరిస్తున్నారు – విజయసాయిరెడ్డి

-

నెల రోజులుగా టీడీపీ పనికి మాలిన చర్చ పెట్టిందనీ అన్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.అదాన్ అనే కంపెనీ నాదేనని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
చెప్పిన అబద్దం మళ్లీ మళ్లీ చెప్తే నిజమై పోతుందని టీడీపీ నమ్మకమనీ ధ్వజమెత్తారు.శ్రీనివాస్ అనే వ్యక్తి విజయ సాయిరెడ్డి అల్లుడు కంపెనీకి చెందిన వాడని ఆరోపిస్తున్నారనీ,
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారనీ మండిపడ్డారు.

విదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వడ్లమూడి నాగరాజు అనే వ్యక్తి కియా మోటార్స్ డీలర్ ఇచ్చారనీ,ఇదే నాగరాజు హెరిటేజ్ కంపెనీల్లో డైరెక్టర్ గా కూడా ఉన్నాడనీ ఆరోపించారు.శ్రీనివాస్ ఎలాగైతే వేరే కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నాడో అదే నాగరాజుకు అప్లై కాదా..? అంటూ ప్రశ్నించారు.నంద్యాల విష్ణురాజు హెరిటేజ్, అమరరాజా బ్యాటరీస్ లోనూ డైరెక్టర్ గా ఉన్నాడని అన్నారు.
మరి అమరరాజ చంద్రబాబుదే అని నేను అనొచ్చా అంటూ ప్రశ్నించారు.లివ్ లైఫ్ హాస్పిటల్స్, ఎక్సెల్ కంపెనీల్లో హెరిటేజ్ కంపనీలో కామన్ డైరెక్టర్స్ ఉన్నారనీ,మరి అవి చంద్రబాబువి అని అనోచ్చా..? అంటూ ధ్వజమెత్తారు.దివీస్ సంస్థ వ్యక్తులు నాకు క్లోజ్ ఫ్రెండ్స్.. నారా ఫ్యామిలీకి క్లోజ్..అలాగని దివీస్ నాది అయిపోతుందా…? అన్నారు.

అదాన్ కంపెనీ 3 శాతం మద్యాన్ని మాత్రమే సప్లై చేస్తోందనీ,రాజకీయంగా ఎదుర్కోలేక లేని పోని ఆరోపణలు చేయొద్దని సూచించారు.మీరు చేసే దుష్ప్రచారం పదింతలు దుష్ప్రచారం చేయగలననీ,
పరిధులు దాటవద్దు అని చంద్రబాబు, లోకేష్ కి వార్నింగ్ ఇస్తున్నానన్నారు.మీరు వాడే అసభ్య పదజాలం మేము కూడా వాడగలమని వార్నింగ్ ఇచ్చారు.ఆకాశం పైకి ఉమ్మెస్తే అది నీ మీదే పడుతుంది చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news