పబ్‌ లో పెగ్‌ వేస్తున్న RRR..ఫోటో షేర్‌ చేసిన విజయసాయి

-

వైసీపీ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఎప్పుడూ.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ.. ప్రతి పక్ష నాయకులపై సెటైర్లు పేల్చుతూ ఉంటారు. అయితే.. తాజాగా వైసీపీ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై ఓ రేంజ్‌ లో సెటైర్ వేశారు. ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. పబ్‌ లో పెగ్ తాగుతున్న ఫోటోను తాజాగా షేర్‌ చేశారు విజయసాయి రెడ్డి.

“పట్టపగలే తప్పతాగి మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు పచ్చ కుల మీడియా మైకుల ముందు మత్తు దిగేదాకా మొరగడం విగ్గు/పెగ్గు రాజు పని. ఒకసారి నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి దగ్గరకు వెళ్తే బయటపడుతుంది నర్సాపురం నక్క అసలు రంగు. ‘నీలి రంగు నక్కగతే పడుతుంది’.” అంటూ సంచలన ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. పసుపు మీడియా, చంద్రబాబు, నారా లోకేష్‌ లాంటి నాయకులు ఏపీ ప్రజలకు నష్టం చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news