శ్రీవారి సన్నిధిలో విజయసాయి, లక్ష్మీ పార్వతి..!

-

ఈ రోజు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే త్వరలోనే తెలుగు అకాడమి కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మీ పార్వతి తెలిపారు. ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చాలామంది భక్తులు ఈ వైరస్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేకపోతున్నారని, అయినప్పటికీ టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం అభినందనీయమని కొనియాడారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news