ఎన్టీఆర్‌ వర్థంతినాడే.. చంద్రబాబుకు కరోనా : ఇదే శిక్ష అంటూ వైసీపీ ఎంపీ సెటైర్లు !

-

కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారీన పడగా.. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఐసోలేషన్‌ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేశారు.

అయితే… చంద్రబాబుకు ఎన్టీఆర్‌ వర్ధంతి రోజునే కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌ లో సెటైర్లు పేల్చారు. ” యాదృచ్ఛికమే అయినా, ఎన్టీఆర్‌ వర్థంతినాడు చంద్రబాబుకు కరోనా సోకటం బాధాకరం. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిగానీ, టీడీపీ వ్యవస్థాపకుడికి బాబు పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుంటుంది.” అంటూ విజయ సాయిరెడ్డి సెటైర్లు పేల్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. కాగా.. నారా లోకేష్‌ సైతం నిన్న కరోనా బారీన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news