కేసీఆర్ కు దేశభక్తి ఉంటే..ఆ హిందువులకు సాయం అందించాలి – విజయశాంతి

-

సిఎం కేసీఆర్ పై మరోమారు విమర్శలు చేశారు విజయశాంతి. మొన్నటి వరకూ పండిట్ల ఊచకోతతో అట్టుడికిన కశ్మీర్‌లో… ఇప్పుడు వారితో పాటు అక్కడున్న ఇతర ప్రాంతాల హిందువులను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారని వెల్లడించారు. ఉగ్రవాదుల ఈ హింసాకాండకు అడ్డుకట్ట వేసి, అక్కడున్న పండిట్లు, హిందువులలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలపై దృష్టి పెట్టిందన్నారు.

కానీ, దుర్మార్గం ఏమిటంటే…. కశ్మీర్ లో పండిట్ల వెతలను బయటపెట్టిన వాస్తవ చిత్రం కశ్మీరీ ఫైల్స్ విడుదలైనప్పుడు… ఆ చిత్రంలో అసత్యాలు చూపించారంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ సహా ఫేక్ సెక్యులర్ నేతలెవ్వరూ ఇప్పుడు నోరు విప్పడం లేదని ఫైర్ అయ్యారు. కశ్మీర్ ఫైల్స్ మరోసారి రిపీట్ అవుతూ….. మళ్ళీ వలసపోక తప్పదేమోనని పండిట్లు కలవరపడుతుంటే, వారిలో భరోసా నింపేందుకు బీజేపీ మినహా ఇతర పార్టీల నాయకులెవ్వరూ ముందుకు రాలేదు. కేంద్ర సర్కారు ఒకపక్క మైనార్టీ హక్కులను కాపాడుతూనే మెజారిటీ సమాజపు సమస్యల్ని పరిష్కరిస్తుంటే…. కశ్మీర్‌లోని తాజా పరిస్థితులపై విపక్షాలేవీ స్పందించకపోవడం వారి కుహనా లౌకికతత్వాన్ని బట్టబయలు చేసిందని అగ్రహించారు.

మైనార్టీల విషయంలో ఏం జరిగినా గగ్గోలు పెట్టే ఈ నేతలకు బాధిత మెజార్టీ ప్రజల వేదన కనిపించదు. ఇక తెలంగాణలో చూస్తే హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటూ ఓట్లేసి గెలిపించిన హిందూ సమాజాన్ని చులకనగా చూసే సీఎం కేసిఆర్…. ఆయన పార్టీకి సయామీ కవల పార్టీగా ఉన్న మతతత్వ ఎంఐఎం…. వీళ్ళకి తీసిపోనన్నట్టుగా కాంగ్రెస్… ముగ్గురికి ముగ్గురూ సరేసరి అని ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా మరణించిన రైతులు, జవాన్ల కుటుంబాలకి చెక్కులు పంచుతున్న కేసీఆర్ గారికి నిజంగా దేశభక్తి ఉంటే…. కశ్మీర్ ఉగ్రవాదులకు బలైన పండిట్లు, హిందువుల కుటుంబాలకు కూడా సాయం అందించాలి. తెలంగాణలో కూడా భైంసా తదితర హింసాకాండల్లో బాధితులైన హిందూ కుటుంబాలకి కూడా సహాయం ప్రకటించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news