కెసిఆర్.. మందుపై దృష్టి తగ్గించి మహిళల గురించి ఆలోచించు – విజయశాంతి

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఒక్కరోజు దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. కెసిఆర్ సీఎం అయినప్పటినుండి నిరంతరం మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. మహిళల గురించి పట్టించుకోని సీఎం సిసోడియా అరెస్ట్ పై బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లిక్కర్ స్కాం లో తన కూతురు ఉందని.. బొక్కలో వేస్తారని ఈ నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు. మహిళలు ధైర్యంగా ఉండాలని… సీఎం తన బాధ్యతను నిర్వర్తించడం లేదన్నారు. కెసిఆర్ మందుపై దృష్టి తగ్గించి మహిళల గురించి ఆలోచించాలని సూచించారు. కెసిఆర్ ని గద్దెదించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. లిక్కర్ స్కాం లో కవితను కూడా పోలీసులు అరెస్టు చేస్తారనే భయం కేసీఆర్ కు పట్టుకుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఏం జరిగినా కూడా కెసిఆర్ కి పట్టడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news