ఆత్మసాక్షి ఏపీ సర్వే సంచలనం..ఆధిక్యం ఎవరిదంటే?

-

ఏపీ రాజకీయాల్లో ఆత్మసాక్షి సర్వే సంచలనం సృష్టిస్తుంది..ఇప్పటికే పలు మార్లు ఏపీ రాజకీయాల్లో సర్వేలు చేసి..రిలీజ్ చేసిన ఆత్మసాక్షి మరోసారి సర్వే వివరాలని బయటపెట్టింది. తాజాగా చేసిన సర్వే వివరాలు బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తం ఫిబ్రవరి 17 వరకు చేసిన సర్వే వివరాలు వదిలారు. ఈ సర్వే ప్రకారం ఊహించని విధంగా అధికార వైసీపీకి 63 స్థానాలు, టీడీపీకి 78 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇక జనసేనకు 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

అంటే ఈ సర్వే టి‌డి‌పి-జనసేన సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే వివరాలని మాత్రమే బయటపెట్టింది. 175 స్థానాలకు గాను టి‌డి‌పికే ఆధిక్యం ఇచ్చింది. 78 స్థానాలతో లీడ్ లో ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 88. అంటే పది స్థానాలకు దూరంలో టి‌డి‌పి ఉంది. ఇక టి‌డి‌పి-వైసీపీల మధ్య గట్టి ఫైట్ జరిగేది 27 స్థానాల్లో. మళ్ళీ ఈ స్థానాల్లో వైసీపీ 14, టి‌డి‌పి 13 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అంటే టి‌డి‌పికి 91 సీట్లు, వైసీపీకి 77 సీట్లు వస్తాయని చెబుతుంది. అటు జనసేనకు 7 సీట్లు వస్తాయని లెక్కలు వేస్తుంది.

Image

ఉమ్మడి జిల్లా వారీగా చూస్తే…శ్రీకాకుళం(10): టి‌డి‌పి-6, వైసీపీ-2, టఫ్ ఫైట్-2.. విజయనగరం(9): టి‌డి‌పి-4, వైసీపీ-3, టఫ్ ఫైట్-2.. విశాఖ(15): టి‌డి‌పి-7, వైసీపీ-5, టఫ్ ఫైట్-3.. తూర్పు గోదావరి(19): టి‌డి‌పి-6, వైసీపీ-6, జనసేన-4, టఫ్ ఫైట్-3.. పశ్చిమ గోదావరి(15): టి‌డి‌పి-8, వైసీపీ-2, జనసేన-3, టఫ్ ఫైట్-2.. కృష్ణా(16): టి‌డి‌పి-8, వైసీపీ-5, టఫ్ ఫైట్-3.. గుంటూరు(17): టి‌డి‌పి-8, వైసీపీ-6, టఫ్ ఫైట్-3.. ప్రకాశం(12) టి‌డి‌పి- 6, వైసీపీ-5, టఫ్ ఫైట్-1.. నెల్లూరు(10): టి‌డి‌పి-5, వైసీపీ-2, టఫ్ ఫైట్-3.. ఛిత్తూరు(14): టి‌డి‌పి-4, వైసీపీ-8, టఫ్ ఫైట్-2.. అనంత(14): టి‌డి‌పి-7, వైసీపీ-7, టఫ్ ఫైట్-1, కడప(10): టి‌డిపి- 2, వైసీపీ-6, టఫ్ ఫైట్-2..కర్నూలు(14): టి‌డి‌పి-7, వైసీపీ-7 సీట్లు గెలుచుకుంటుందని ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news