కిమ్ జాంగ్ ఉన్ తో లోకేష్ డీల్..!

-

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లను మరోసారి టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇద్దరిపై ట్విట్టర్ వేదికంగా సెటైర్లు పేల్చారు. తెలుగుదేశం పార్టీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా లోకేశ్ ను చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని, ఇక కిమ్ జాంగ్ ఉన్ వంటి అంతర్జాతీయ నేతలతో మాత్రమే సంబంధాలు నడిపేలా చూడాలన్న నిర్ణయానికి వచ్చారని ఆయన తనదైన శైలిలో వారిపై విరుచుకుపడ్డారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడి మార్పుపై చర్చ జరుగుతున్న వేళ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు. “తెలుగు ప్రజలతో చినబాబు సంబంధాలు పెట్టుకోలేక పోతున్నారు. ఆయన్ని ప్రజలంతా తిరస్కరించారు. ఇక చంద్రబాబు ఆయన్ను తెలుగుదేశం పార్టీకి అంతర్జాతీయ అధ్యక్షుడిగా చేయాలని, ఆయనతో కిమ్ జాంగ్ ఉన్ తదితర నేతలతో సంబంధాలు పెట్టుకునేలా చూడాలని భావిస్తున్నారు” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read more RELATED
Recommended to you

Latest news