లోకేశ్ ను మాలోకం అనేది అందుకే..!

-

అదేంటో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఏం చేసినా సరే అందరికంటే ముందు రియాక్ట్ అయిపోతుంటారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. నిత్యం ఆయన్ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ఏదోక విమర్శ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా నారా లోకేశ్ నిన్న అనంతపురం జిల్లాలో జరిపిన పర్యటనపై కూడా విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.  “లోకేశ్ ను మాలోకం అనేది అందుకే. జెసి కుటుంబాన్ని ఓదార్చడానికెళ్లాడా, వీళ్లు తక్కువోళ్లు కాదు, శాస్తి జరిగింది అని తిట్టడానికి వెళ్లాడా?  వీడియో క్లిప్పింగ్ చూస్తే ఇదే అనుమానం వస్తుంది. తనను, తండ్రిని కూడా అరెస్టు చేస్తారేమో అని అమాయకత్వం నటించాడు. చేసిన స్కాములు ఒకటా రెండా” అంటూ విమర్శలు గుప్పించారు. కాగా, బస్సుల అక్రమ రవాణా, దొంగ పర్మిట్ల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి, కడప జైలుకు తరలించిన తరువాత, లోకేశ్ వారి కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news