విజయవాడ నుండి షిరిడి స్పెషల్ ప్యాకేజీ… ఎంచక్కా ఈ ప్రదేశాలు చూసి వచ్చేయచ్చు..!

-

మంచి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే.
సమ్మర్‌లో షిరిడీ టూర్ ప్లాన్ చెయ్యాలని అనుకునే వాళ్ళు ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఐఆర్‌సీటీసీ టూరిజం షిరిడీకి ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. సాయి సన్నిధి పేరు తో విజయవాడ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో వుంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్రతీ మంగళవారం మంగళవారం ఉంటుంది. ప్యాకేజీ రూ.5,000 లోపే. సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే పర్యాటకులు షిరిడీ లో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

శనిశిగ్నా పూర్ శనేశ్వర దేవస్థానాన్ని సందర్శించవచ్చు. మొదటి రోజు విజయవాడలో షిరిడీ స్టార్ట్ అవ్వాల్సి వుంది. ఉదయం 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. ఈ జర్నీ రాత్రి అంతా ఉంటుంది. రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ రీచ్ అవుతారు. అక్కడ నుండి షిరిడీకి బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ లో సాయిబాబా ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఆ తరవాత షాపింగ్ చేయొచ్చు. రాత్రికి షిరిడీలో బస చేయాలి. మూడో రోజు ఉదయం షిరిడీ నుండి శనిశిగ్నాపూర్ బయల్దేరాలి.

శనిశిగ్నాపూర్ శనేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు. తిరిగి షిరిడీ చేరుకోవాలి. ఆ తర్వాత తిరుగు ప్రయాణం. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌ లో రైలు ఎక్కాలి. నాలుగో రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు విజయవాడ రీచ్ అవ్వచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. గ్రూప్ బుకింగ్‌లో నలుగురి నుంచి ఆరుగురు ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.4850, ట్విన్ షేరింగ్‌కు రూ.5,630. కంఫర్ట్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7310, ట్విన్ షేరింగ్‌కు రూ.8,080 చెల్లించాలి. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే ధరలు వేరే ఉంటాయి. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చూసి బుక్ చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news