వికారాబాద్ కిడ్నాప్ కేసు : డ్రామా అవసరం లేదంటున్న అమ్మాయి పేరెంట్స్ !

-

వికారాబాద్ లో దీపికా కిడ్నాప్ కు గురై సుమారు 40 గంటలు కావొస్తోంది. అయితే ఇప్పటివరకు దీపిక, అఖిల్ ల జాడ లేదు. కిడ్నాప్ చేసింది అఖిల్ అనే పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే దీపికా పేరెంట్స్ లో టెన్షన్ నెలకొంది. 2016లో పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా దీపిక, అఖిల్ లు కలిసి ఉండలేకపోయరాని, అమ్మాయికి ఇష్టముంటే ఇంత కిడ్నాప్ డ్రామా అవసరం లేదని అమ్మాయి పేరెంట్స్ చెబుతున్నారు.

దీపిక గాలింపు కోసం మరో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 7 బృందాలతో గాలిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక లో ఉన్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఇద్దరూ ఇష్టపడి వెళ్ళిపోతే ఇప్పటి వరకుఎందుకు అందుబాటులోకి రాలేదనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అఖిల్‌ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతో అందరిలో టెన్షన్ పెరుగుతోంది. అఖిల్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. నిన్నటి వరకు దీపికా, అఖిల్‌లు కోర్టులో కాని లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ లో రక్షణ కోసం వెళ్తారని పోలీసులు భావించారు. కానీ అలాంటిదేమి జరగకపోవడంతో అందరిలో టెన్షన్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news