BREAKING : వైసీపీ ఎమ్మెల్యేపై గ్రామస్తుల దాడి..పరిస్థితి ఉద్రిక్తత

-

BREAKING : ఏలూరు ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లి లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మండలంలోని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై గ్రామస్తులు దాడి చేశారు. ఈ గ్రామస్తుల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే పై దాడి చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. వైసిపి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం వైసిపి పార్టీ కార్యకర్త గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే అయినా తలారి వెంకటరావు అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే…వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడి చేశారు. ఇక సంఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news