వీవీ వినాయక్‌కు ఆ మాట చెప్పేందుకు ఇబ్బంది పడ్డ తారక్..తర్వాత ఏం జరిగిందంటే?

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్..వీవీ వినాయక్-తారక్ అని చెప్పొచ్చు. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘ఆది’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇద్దరి తొలి ప్రయత్నంలో సూపర్ హిట్ పిక్చర్ వచ్చింది. ఇక ఆ తర్వాత తారక్…స్టార్ హీరో గా మారిపోయి సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు.

వీవీ వినాయక్ సైతం ‘ఆది’ తర్వాత స్టార్ డైరెక్టర్ అయిపోయారు. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ఆది’ పిక్చర్ తీయడానికి ముందర ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో తెలిపాడు. నిజానికి తాను తారక్ తో ‘ఆది’ అనే సినిమా కాకుండా ‘శ్రీ’ అనే సెన్సిటివ్ హై బడ్జెట్ లవ్ స్టోరి తీయాలనుకున్నానని చెప్పుకొచ్చాడు.

దాదాపు ఈ పిక్చర్ కు రూ.50 లక్షల బడ్జెట్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నానని వినాయక్ తెలిపాడు. ఇక ఆ క్రమంలోనే ప్రొడ్యూసర్ బుజ్జీ ద్వారా ఎన్టీఆర్ కు కథ చెప్పానని తెలిపాడు వినాయక్. అయితే, తారక్ తనకు టైం లేదని , త్వరగా స్టోరి చెప్పాలని అడిగాడట. దాంతో కేవలం ఐదు నిమిషాల్లో ఇంట్రడక్షన్ సీన్ చెప్పగా, తారక్ కు కథ నచ్చింది. దాంతో రెండు గంటల పూర్తి కథ రెడీ చేశానని వినాయక్ పేర్కొన్నాడు.

అప్పుడు ఇక స్టోరి రెడీ అయిపోయి, సినిమా తీద్దామనుకునేలోపు కొడాలి నాని తారక్ తో లవ్ స్టోరిలు వద్దని చెప్పాడట. ఈ విషయం తనకు చెప్పాలని తారక్ చాలా సార్లు ప్రయత్నించాడని, కానీ, ఆ మాటలు చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డాడని గుర్తు చేసుకున్నాడు యాక్షన్ డైరెక్టర్ వినాయక్. అప్పుడే తనే అర్థం చేసుకుని అవకాశం ఇస్తే ఇంకో కథ చెప్తానని తాను అన్నానని వినాయక్ తెలిపాడు. అలా ‘ఆది’ స్టోరి చెప్పానని, ఆ సినిమా సూపర్ హిట్ అయిందని వివరించాడు. ‘శ్రీ’ అనే సినిమా లవ్ స్టోరిని ఏళ్ల పాటు రాసుకున్నానని, కానీ, ‘ఆది’ స్టోరి కేవలం రెండ్రోజుల్లోనే రాసుకున్నానని వినాయక్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news