బీజేపీ సీఎంలంతా రవీంద్ర భారతికి రండి…తేల్చుకుందాం : వినోద్ కుమార్

-

కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని ఫైర్‌ అయ్యారు బోయినిపల్లి వినోద్ కుమార్. శివరాజ్ సింగ్ చౌహన్ ,ఫద్నవిస్, రమన్ సింగ్ ,హేమంత బిశ్వస్ శర్మ …మీరంత ఒకే సారి రండి… రవీంద్ర భారతిలో కూర్చుని మీ రాష్ట్రాల అభివృద్ధి… తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడదామని సవాల్‌ విసిరారు. మా రాష్ట్ర మంత్రులు ఉంటారు…మీరు మీ అధికారులతో రండి …అభివృద్ధి గురించి చర్చిద్దామని పేర్కొన్నారు.

బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని… ఈ నలుగురు నేతలు 33 జిల్లాలు తిరిగితే …తెలంగాణ ఏంటో తెలుస్తుందని చురకలు అంటించారు. నలుగురికి హెలికాప్టర్లు మేమే ఇస్తాం …రాష్ట్రం అంత తిరిగి చూడండని సవాల్‌ విసిరారు. ఆర్ఎస్ఎస్ సమావేశాల కోసం జేపీ నడ్డా వస్తే …బండి సంజయ్ అరెస్టు కోసం వచ్చినట్టు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. బ్యాంకులను మోసము చేసిన వారిలో ఎక్కువ గుజరాతీలేనని.. ఒకవైపు తెలంగాణ సర్కార్ పై విమర్శలు చేస్తూ.. మరోవైపు పథకాలు గురించి ఇక్కడి అధికారులను తెలుసుకుని వెళుతున్నారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు తెలంగాణలో టిఆర్ఎస్ సర్కార్ కు పోలిక లేనేలేదని పేర్కొన్నారు. అంతా బాగుంటే బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి తెలంగాణ లో స్కీమ్స్ ఎందుకు స్టడీ చేస్తున్నారు ? అరుణాచల్ ప్రదేశ్ లో జెండా ఎగరేస్తే…మోడీ సర్కారు పట్టించుకోదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news