కాళేశ్వరం నీళ్లు అంతా కేసీఆర్ ఫామ్ హౌజ్ కే మలుపుకున్నాడు- డీకే అరుణ

-

లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే… ఎక్కడా ఒక్క చుక్క నీరు పారలేదని.. కేవలం కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవెల్లికే నీటిని మలుపు కున్నారని బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. మూడు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి కడుతాఅని.. 14 లక్షల ఎకరాాలకు నీరు అందిస్తామన్న కేసీఆర్ ఇప్పడు ఈ హామీ ఎమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కుటుంబం దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు రక్తాన్ని దొచుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందని డీకే అరుణ అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆమె అన్నారు.

dk aruna

డబుల్ బెడ్రూం ఇళ్ల హామీతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత చేష్టలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను, ప్రజలను కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు రాష్ట్రాన్ని సాధించుకుంటే.. కేవలం ఫలాలను కల్వకుంట్ల కుటుంబం మాత్రమే పొందుతుందని విమర్శించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. బండి సంజయ్ 317 జీవో కు వ్యతిరేఖంగా బండి సంజయ్ జాగరణ దీక్షచేస్తుంటే… డైరెక్ట్ గా సీపీకి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి దాడి చేయించేలా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రతి ఒక్క వర్గం కూడా కేసీఆర్ ను వెంటనే గద్దె దింపాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news